తెలంగాణ

telangana

ETV Bharat / state

" ప్లాస్టిక్​ను తరిమికొడదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం" - 'సే నో టు ప్లాస్టిక్' 2కే రన్‌ కార్యక్రమాన్ని సినీ నటుడు సుమన్ ప్రారంభించారు

హైదరాబాద్​లో లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సే నో టు ప్లాస్టిక్' 2కే రన్‌ కార్యక్రమాన్ని సినీనటుడు సుమన్ ప్రారంభించారు. ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకుని పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

'పర్యావరణాన్ని కాపాడుకోవాలి' :నటుడు సుమన్​

By

Published : Sep 29, 2019, 12:53 PM IST

'పర్యావరణాన్ని కాపాడుకోవాలి' :నటుడు సుమన్​

హైదరాబాద్​లోని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సే నో టు ప్లాస్టిక్' 2కే రన్‌ కార్యక్రమాన్ని సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకుని పర్యావరణాన్ని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హీరో సుమన్ పిలుపునిచ్చారు. రసాయనాలతో నిండిన ప్లాస్టిక్ ప్రమాదకర క్యాన్సర్​ వంటి వ్యాధులకు కారణమవుతుందని ఆయన అన్నారు.​ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, స్థానికులు పాల్గొని మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details