తెలంగాణ

telangana

ETV Bharat / state

'సగర సంఘం భవన స్థలం మార్చడానికి కుట్ర చేస్తున్నారు' - Rangareddy District Latest News

సగర జాతికిచ్చిన స్థలాన్ని మార్చవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కొందరు అధికారులు కుట్రలు చేసి స్థల మార్పిడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. సర్కారు కాంట్రాక్ట్ పనుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని కోరింది.

Sagara Sangham state president Uppari Shekhar Sagar demanded that the Sagara Jati building site should not be changed
కోకాపేటలో సగర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు

By

Published : Feb 8, 2021, 6:23 AM IST

ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం సగర జాతికి ఇచ్చిన స్థలాన్ని మార్చరాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ డిమాండ్ చేశారు. కులాలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను కొందరు అధికారులు కుట్ర చేసి మార్పిడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

రిజర్వేషన్ కల్పించాలి..

కోర్టు ఆదేశాలు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే మొదట కేటాయించిన ప్లాట్ వద్ద సగర ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. సంఘాన్ని పటిష్ఠం చేయడానికి గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని తీర్మానించారు. నిర్మాణ రంగమే కుల వృత్తిగా కొనసాగిస్తున్న సగరులకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్ కల్పించాలని సర్కారును కోరారు.

సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం, కోశాధికారి నలుబాల బిక్షపతి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, ఉమ్మడి ఏపీ మాజీ అధ్యక్షుడు ఆర్.బి. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రాం సగర పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఐదు గ్రామాల రైతులు పాదయాత్ర

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details