డాక్టర్స్ డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా వైద్య శాఖకు కియోస్క్ మిషన్ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అందజేశారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో కరోనా పరీక్షల కోసం వినియోగించే కియోస్క్ మిషన్ను అందించారు. సీపీ మహేశ్ భగవత్, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ కలిసి మిషన్ను ప్రారంభించారు.
వనస్థలిపురం ఆస్పత్రికి కియోస్క్ మిషన్ అందజేసిన సీపీ - vanastalipuram area hospital
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోని కరోనా పరీక్షా కేంద్రానికి కియోస్క్ మిషన్ను సీపీ మహేశ్ భగవత్ అందజేశారు. డాక్టర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మిషన్ను సీపీ ప్రారంభించారు. ఈ మిషన్తో కరోనా పరీక్షలు చేయటం సులువవుతుందని తెలిపారు.
rachakonda cp mahesh bhagavat started kiyask mission in vanastalipuram hospital
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు ఈ మిషన్ సాయంతో నిర్ధరణ పరీక్షలు నిర్వహించేందుకు సులువుగా ఉంటుందని సీపీ తెలిపారు. కరోనా సమయంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని మహేశ్ భగవత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.