తెలంగాణ

telangana

కబ్జాకు గురవుతున్నా పట్టించుకోరా.. కార్పొరేటర్​పై స్థానికుల దాడి

By

Published : Oct 18, 2020, 12:21 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ రంగానాయకుల గుట్టకాలనీలో నాలా భూమిలన్నీ కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పటించుకోలేదని కార్పొరేటర్ సామ తిరుమల్​ రెడ్డిని నిలదీశారు. కాలనీ వరదలో మునిగిపోతుందంటూ కార్పొరేటర్​పై దాడి చేశారు.

people attack on  corporator thirumal in hayathnagar
కబ్జాకు గురవుతున్నా పట్టించుకోరా అంటూ కార్పోరేటర్​పై దాడి

భారీ వర్షాలతో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలకు కారణం నాలాలను కబ్జా చేయడమే అంటున్నారు రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ రంగానాయకుల గుట్టకాలనీ వాసులు. నాలా భూమిలన్నీ కబ్జాలకు గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కబ్జాకు గురవుతున్నా పట్టించుకోరా అంటూ కార్పోరేటర్​పై దాడి

ఈ విషయమై గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పటించుకోలేదని కార్పొరేటర్ సామ తిరుమల్​ రెడ్డిని నిలదీశారు. కాలనీ వరదలో మునిగిపోతుందంటూ కార్పొరేటర్​పై దాడి చేశారు. తిరుమల్​ రెడ్డిని గల్లా పట్టుకుని కొట్టారు. చర్చి దగ్గర ఉన్న నాలా కబ్జాకు గురైందని.. ఇన్నీ రోజులుగా కార్పొరేటర్​ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:భాగ్యనగరంలో కాలనీలు జలమయం... అవస్థల్లో జనం

ABOUT THE AUTHOR

...view details