రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో దారుణం చోటుచేసుకుంది. గ్రామశివారులో ఒంటరిగా నివసిస్తోన్న బాలమణి (80) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు - రంగారెడ్డి జిల్లాలో వృద్ధురాలి హత్య
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాల్ని ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. బాలమణి ఇళ్లు ఊరికి చివర ఉండటం, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసిన వారే ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :భార్యపై ప్రేమతో అడవినే సృష్టించాడు