గుండెల్లో పెట్టుకుని పెంచిన పిల్లలే బయటకి పొమ్మన్నారు. ఆదరించి పెంచిన వారిని బయటకు నెట్టేశారు. ఎంతో జీవితాన్ని చూసిన వారికి నేడు జీవనం భారమైంది. దిక్కుతోచని స్థితిలో ఆ పండుటాకులకు ఆసరాగా నిలిచింది మాతాపితరుల సేవాసదనం. వీళ్లకు ఇప్పుడు కావాల్సింది పట్టెడన్నం, గుప్పెడు ప్రేమ, పుట్టెడు ఆదరణ. వార్థక్యంలో వ్యధలతో గడుపుతున్న వారికి అదో దేవాలయం.. స్నేహితులతో కబుర్లు చెప్పుకోడానికి అదో కళాశాల. భక్తికోసం అదో ధ్యాన మందిరం.. తమ జీవితాలతో ముడిపడిన పవిత్ర ప్రదేశం ఈ మాతాపితురులు సేవాసదనం.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్లోని మాతాపితరుల సేవాసదనం ఆదరణ కరవైన ఎందరో వృద్ధుల పాలిట అమ్మఒడి. స్వాతంత్య్ర సమరయోధుడు బండారు చిన్న రంగారెడ్డికి ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చింది. రెండెకరాల్లో మాతాపితురుల సేవాసదనం పేరుతో ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తన భార్య సరోజినీదేవి స్మృత్యర్థం పౌండేషన్ ఏర్పాటు చేసి 2005 నుంచి ఎందరికో ఆశ్రయం కల్పించాడు.
పింఛనుతోనే ఆసరా ఇస్తూ