రంగారెడ్డి జిల్లా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు. హయత్నగర్ మండలంలోని కుంట్లూర్ గాంధీ కుటీర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధుల సమక్షంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. చేనేత దుస్తులను ప్రతిఒక్కరూ వాడినప్పుడే చేనేతకు మనం నిజమైన చేయూతనిచ్చినట్లు అవుతుందని వివరించారు.