ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సోమవారం చేవెళ్లలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ రంజిత్రెడ్డి ఎన్నికలపై అవగాహన కల్పించారు. అక్టోబర్ 1 నుంచి ప్రతి పట్టభద్రులు.. ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎంపీ సూచించారు. ఎన్నికలు ఏదైనా గులాబీ జెండా ఎగరడం ఖాయమని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఎంపీ రంజిత్ ధీమా - graduate mlc election news
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రజాప్రతినిధులు, యువకులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సదస్సులో ఎంపీ రంజిత్రెడ్డి అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
![పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఎంపీ రంజిత్ ధీమా mp ranjith reddy awareness program on graduate mlc elections at chevella](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8972526-855-8972526-1601301665946.jpg)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఎంపీ రంజిత్ ధీమా
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాముఖ్యతను గ్రాడ్యుయేట్స్కు వివరించాలన్నారు. రంగారెడ్డి వివిధ పరిశ్రమలకు హబ్గా మారనున్న నేపథ్యంలో జిల్లాలోని స్థానిక యువతకే ఉద్యోగ- ఉపాధి అవకాశాలు వస్తాయనే అంశాన్ని డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికి చేరవేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు రంజిత్రెడ్డి సూచించారు.
ఇదీ చూడండి:వరుస ఎన్నికలపై కారు నజర్.. పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ
TAGGED:
mp ranjith reddy latest news