తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశ్నించే గొంతులకే ఓట్లు వేయాలి: ఎంపీ కోమటిరెడ్డి - latest news on mp komati reddy venkatareddy

ఆదిభట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రశ్నించే గొంతులకే ఓటు వేయాలంటూ సూచించారు.

mp komati reddy venkatareddy participated in muncipal election compaign
ప్రశ్నించే గొంతులకే ఓట్లు వేయాలి: ఎంపీ కోమటిరెడ్డి

By

Published : Jan 19, 2020, 1:11 PM IST

మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్​షో నిర్వహించారు. ప్రశ్నించే గొంతులకే ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని ఎంపీ పేర్కొన్నారు. తెరాస అభ్యర్థులు ఓటర్లను, ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తెరాసను నమ్మే పరిస్థితులు పోయాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ప్రశ్నించే గొంతులకే ఓట్లు వేయాలి: ఎంపీ కోమటిరెడ్డి

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్​నగర్ కార్పొరేషన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details