తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టభద్రుల సమస్యలపై పోరాడతా: స్వతంత్ర అభ్యర్థి సతీష్​

పట్టభద్రుల సమస్యలపై శాసన మండలిలో పోరాడటానికి తనకు అవకాశం కల్పించాలని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్​ అన్నారు. హైదరాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంషాబాద్​లో అధ్యాపకులతో సమావేశమయ్యారు.

By

Published : Feb 21, 2021, 1:00 PM IST

gowri sathish mlc candidate
స్వతంత్ర అభ్యర్థి సతీష్​

ప్రశ్నించే గొంతుకకు మద్దతిస్తే పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో పోరాటం చేయవచ్చని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ జిల్లాల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి గౌరీ సతీష్ అన్నారు. శంషాబాద్​లోని విజ్ఞాన్ పీజీ కళాశాల సమీపంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వివిధ కళాశాలల అధ్యాపకులతో సతీష్​ సమావేశమయ్యారు. ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో పట్టభద్రులకు న్యాయం చేస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్​.. ఆరేళ్లయినా సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని సతీష్​ విమర్శించారు. కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తెరాస పాలనలో విద్యారంగం నిర్వీర్యం అయిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:'మాతృభాషను ప్రేమిద్దాం.. మన సంస్కృతిని కాపాడదాం'

ABOUT THE AUTHOR

...view details