తెలంగాణ

telangana

'గెలిచిన మూడు నెలల్లో కాలనీ సమస్యలు తీర్చే బాధ్యత నాది'

By

Published : Jan 18, 2020, 9:27 PM IST

రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని పలు కాలనీల్లోని ప్రజలతో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే... మూడు నెలల్లోపే కాలనీల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ​

mla campaign in rangareddy district
'గెలిచిన మూడు నెలల్లో సమస్యలు తీర్చే బాధ్యత నాది'

పని చేసిన వారికే ఓటు వేయాలని బండ్లగూడ కాలనీ ఓర్లను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ కోరారు. కాలనీలో ఉన్న సమస్యలన్నీ ఎన్నికైన మూడు నెలల్లోపే ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

తనను ఎమ్మెల్యేగా ఏ విధంగా మెజార్టీతో గెలిపించారో అదే విధంగా కార్పొరేటర్లను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బండ్లగూడలోని పలు కాలనీవాసులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన పది రోజుల్లోనే అధికారులను తీసుకుని వచ్చి వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

'గెలిచిన మూడు నెలల్లో సమస్యలు తీర్చే బాధ్యత నాది'

ఇవీ చూడండి: తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక?

ABOUT THE AUTHOR

...view details