రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్నగర్లో స్థానిక డివిజన్ గౌరవ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హాజరై... 200 మంది నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర సరకులు, పండ్లు, హెల్త్ కిట్లను అందజేశారు.
నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరికెపూడి
కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన బ్రాహ్మణులకు ఎమ్మెల్యే నిత్యావసరాలను పంపిణీ చేశారు.
rangareddy district latest news
డివిజన్ పరిధిలో ఎవరైన ఇబ్బందులు పడుతున్నవారు ఉంటే స్థానిక నాయకులు తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. స్వయంగా వారి సమస్యలను తొలగించేందుకు వీలైనంత మేరకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.