రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు నడుస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు పలకాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరులో ఆయన పర్యటించారు. పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
రాష్ట్ర అభివృద్ధే తెరాస లక్ష్యం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - రాష్ట్ర అభివృద్ధి పథకాలు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు.
![రాష్ట్ర అభివృద్ధే తెరాస లక్ష్యం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ kottur municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:48:30:1619169510-tg-sdnr-21-23-kothur-mantripracharam-avb-ts-10155-23042021144126-2304f-1619169086-915.jpg)
kottur municipality
పేదల సంక్షేమానికి.. ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు పథకాలను గురించి ఓటర్లకు వివరించారు శ్రీనివాస్ గౌడ్. తెరాస అభ్యర్థికి ఓటు వేసి.. కొత్తూరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ వెనకాడరు : మంత్రి ఈటల