తెలంగాణ

telangana

By

Published : Nov 22, 2019, 10:37 PM IST

ETV Bharat / state

ఆమనగల్​లో మంత్రి సత్యవతి రాఠోడ్​ పర్యటన

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు.

ఆమనగల్​ మండలంలో మంత్రి సత్యవతి రాఠోడ్​ పర్యటన

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్​ మండల కేంద్రంలో పర్యటించారు. ఆమనగల్​ పురపాలిక పరిధిలోని మహిళా సంక్షేమ నిలయాన్ని సందర్శించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణీలకు అంగన్​వాడీల ద్వారా పోషకాహారం వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. గిరిజన బాలికలకు ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్, ​తెరాస నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆమనగల్​ మండలంలో మంత్రి సత్యవతి రాఠోడ్​ పర్యటన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details