తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పనులకు మంత్రి సబిత శంకుస్థాపన - Minister Sabitha latest news in Shankar Palli Mandal

శంకర్ పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఏడు కోట్లకు పైగా వ్యయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ, రైతువేదిక భవనాలకు శంకుస్థాపనలు చేశారు.

Minister Sabita laid the foundation stone for various development works
శంకర్ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు మంత్రి సబితా శంకుస్థాపన

By

Published : Dec 28, 2020, 10:05 PM IST

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఏడు కోట్ల 50లక్షల వ్యయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

జన్వాడ, గోపులారం, సంకేపల్లి గ్రామాల్లో పంచాయతీ భవనాల పనులు ప్రారంభించారు. మోకీలలో రైతువేదిక భవనం, పశువుల ఆస్పత్రి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

కార్యక్రమంలో చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ సాత విజయలక్ష్మి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ గోపాల్ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సీఎం కేసీఆర్​ వాదన అనుమానాస్పదంగా ఉంది: షబ్బీర్​ అలీ

ABOUT THE AUTHOR

...view details