తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2020, 2:34 PM IST

ETV Bharat / state

'గులాబీ అభ్యర్థికి మద్దతుగా విద్యాశాఖ మంత్రి ప్రచారం'

అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే... సంక్షేమ ఫలాలు త్వరగా అందుతాయని, కార్పొరేషన్​ అభివృద్ధి సులభమవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

minister sabitha indra reddy campaign for municipal elections in rangareddy
'గులాబీ అభ్యర్థికి మద్దతుగా విద్యాశాఖ మంత్రి ప్రచారం'

'గులాబీ అభ్యర్థికి మద్దతుగా విద్యాశాఖ మంత్రి ప్రచారం'

రంగారెడ్డి జిల్లా మీర్​పేట్​ కార్పొరేషన్​లోని పదో వార్డులో తెరాస అభ్యర్థులకు మద్దతుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే... వార్డులోని సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని తెలిపారు.

తెరాస అభ్యర్థి పవన్​కుమార్​కు పట్టం గడితే.... వార్డులో సీసీ కెమెరాలు, రహదారులు, రవాణా వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే... సంక్షేమ ఫలాలు త్వరగా అందుతాయని మంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details