హత్యపై సమగ్ర విచారణ జరిపిస్తాం: మంత్రి సబితా
తహసీల్దార్ విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అధికారులు ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పారు. విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హత్య వెనుక ఎవరున్నారు... ఎవరి ప్రోద్బలంతో చేశారనే దానిపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం : మంత్రి సబితా