రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు నుంచి స్వచ్ఛందంగా మినీ లాక్డౌన్ విధించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు లాక్డౌన్ కొనసాగనుంది.
ఇబ్రహీంపట్నంలో రోజురోజుకు కరోనా కేసులు అధికం అవుతుండడం వల్ల ఎవరికివారు స్వీయనియంత్రణకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు మున్సిపాలిటీలో మినీ లాక్డౌన్ అమలు చేయనున్నారు.