తెలంగాణ

telangana

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మినీ లాక్​డౌన్

ఇబ్రహీంపట్నంలో రోజురోజుకు కరోనా కేసులు అధికం అవుతుండడం వల్ల నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు మినీ లాక్​డౌన్ విధించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు లాక్​డౌన్ కొనసాగుతుందని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయించింది.

By

Published : May 8, 2021, 6:05 PM IST

Published : May 8, 2021, 6:05 PM IST

Mini lock down, Ibrahimpatnam
Mini lock down, Ibrahimpatnam

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు నుంచి స్వచ్ఛందంగా మినీ లాక్​డౌన్​ విధించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు లాక్​డౌన్ కొనసాగనుంది.

ఇబ్రహీంపట్నంలో రోజురోజుకు కరోనా కేసులు అధికం అవుతుండడం వల్ల ఎవరికివారు స్వీయనియంత్రణకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు మున్సిపాలిటీలో మినీ లాక్​డౌన్ అమలు చేయనున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకే ఈ మినీ లాక్​డౌన్ అని.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ కప్పరి స్రవంతి, కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఆకుల యాదగిరి అన్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details