తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

పోలీస్​ స్టేషన్​లోనే ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం హైదరాబాద్​ శివారు నార్సింగిలో  కలకలం సృష్టించింది. మృతికి ఎస్సై శ్రీధర్​ కారణమని మృతుని బంధువులు ఆరోపించి ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మాదాపూర్​ ఏసీపీ హామీ ఇవ్వటంతో విరమించారు.

పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

By

Published : Nov 20, 2019, 5:42 PM IST

హైదరాబాద్ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. నార్సింగి గ్రామంలో గత కొంత కాలంగా నయీముద్దీన్, మొయినుద్దీన్​కు భూవివాదం జరుగుతుంది. ఈ స్థల విషయం మాట్లాడేందుకు స్థానిక నయీముద్దీన్​, అతని సోదరులను అధికారులు పోలీస్​స్టేషన్​కు పిలిపించారు. ఎస్ఐ శ్రీధర్​తో నయీముద్దీన్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కుప్పకులాడు. దీనితో వెంటనే బంధువులు స్థానిక ఆస్పత్రికి తరలించగా... నయీముద్దీన్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.

మృతుడి బంధువులు, స్థానిక నాయకులు... నార్సింగి పోలీస్ స్టేషన్​కు చేరుకొని ధర్నాకు దిగారు. మృతికి కారకుడైన ఎస్సై శ్రీధర్​ను, సస్పెండ్ చేయాలని, ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ స్పందించి... విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకుంటానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

ఇవీ చూడండి: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ABOUT THE AUTHOR

...view details