హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. నాంపల్లి క్రిమినల్ కోర్టు ముందు.... విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని.. విచారణ సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో న్యాయవాదుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ... సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఎదుడట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. నిరసనలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
విధులు బహిష్కరించి
హత్య ఘటనలో నిందితులు ఎంతటివారైనా...అదుపులోకి తీసుకుని న్యాయం చేయాలని... కూకట్పల్లిలో బార్ అసోసియేషన్ సభ్యులు మానవహారం చేపట్టారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో క్యాండిల్ ర్యాలీ చేపట్టి... నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు... విజయవాడ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. నిజామాబాద్లో నల్లమాస్కులు ధరించి.. వామన్రావు హత్య ఘటనపై నిరసన తెలిపారు.