తెలంగాణ

telangana

విజయారెడ్డి హత్యకేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

విజయారెడ్డి హత్యకేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం  చేశారు.  ఆమె భర్త సుభాష్​ రెడ్డి వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. నిందితుడు సురేష్​ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. హత్యలో ఇంకెవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

By

Published : Nov 7, 2019, 8:01 AM IST

Published : Nov 7, 2019, 8:01 AM IST

విజయారెడ్డి హత్యకేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు ఆమె భర్త సుభాష్ రెడ్డి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. హత్యలో సురేష్​ కాకుండా ఇతరుల ప్రమేయం ఉండొచ్చని పోలీసులకు సుభాష్​రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు అధికారి, వనస్థలిపురం ఏసీపీ జయరాం.. అబ్దుల్లాపూర్ మెట్​ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఘటన జరిగిన తీరును మరోసారి పరిశీలించారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నిచారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సురేష్​ భార్య, తల్లిదండ్రులు, పెద్దనాన్నను పోలీసులు ప్రశ్నించారు. హత్యలో ఇంకెవరి ప్రమేయం ఏమైనా ఉందా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ గురునాథం చనిపోవడంతో నిందితుడు సురేష్​ పైన పోలీసులు మరో కేస్​ నమోదు చేశారు. వివాదాస్పద భూమికి సంబంధించిన దస్త్రాలను పోలీసులు ఇదివరకే స్వాధీనం చేసుకొని వాటిని పరిశీలిస్తున్నారు.

విజయారెడ్డి హత్యకేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details