తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2020, 4:30 PM IST

ETV Bharat / state

నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కిషన్​ రెడ్డి

అబ్దుల్లాపూర్​మెట్​ మండలంలోని పలు గ్రామాల్లోని పేదలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడికోసం ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు.

mla kishan reddy distributed essentials to poor
నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కిషన్​ రెడ్డి

లాక్​డౌన్ నిబంధనలను ప్రజలందరూ కచ్చితంగా పాటించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలంలోని లష్కర్ గూడ, సుర్మాయిగూడ, ఇనాంగూడ గ్రామాల్లో పేదలకు బియ్యం, గుడ్లు, పండ్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

లాక్​డౌన్​ సందర్భంగా విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు, అధికారులకు గొడుగులు అందజేశారు. అనవసరంగా ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని ఎమ్మెల్యే కిషన్​రెడ్డి సూచించారు.

ఇదీ చూడండి :చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది

ABOUT THE AUTHOR

...view details