Harish rao in Kondapur hospital: కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో త్వరలోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సీఎస్ఐఆర్లో భాగంగా రహేజా కార్ప్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన 100 పడకల వార్డులను ఆయన ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా 10 కోట్లు ఖర్చు చేసిన సంస్థ ప్రతినిధులను అభినందించారు. కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా అదనంగా 120 పడకలతో మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు.
మూడోదశ ఎదుర్కొనేందుకు సిద్ధం
harish rao on third wave: కొవిడ్ సమయంలో హైదరాబాద్లో అప్పటికే అందుబాటులో ఉన్న పడకలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అదనంగా 1300 పడకలను ప్రైవేట్ సంస్థలు సీఎస్ఐఆర్ కింద సమకూర్చాయని హరీశ్ రావు తెలిపారు. మూడో దశ వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్, డీఎంఈ రమేశ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి పాల్గొన్నారు.