తెలంగాణ

telangana

ETV Bharat / state

పిగ్లీపురంలో ఈతకు వెళ్లి చనిపోయిన విద్యార్థి మృతదేహం వెలికితీత - enjineering student

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం పిగ్లీపురం చెరువులో పడి నిన్న చనిపోయిన యువకుని మృతదేహాన్ని వెలికితీశారు.

పిగ్లీపురంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

By

Published : Nov 21, 2019, 4:17 PM IST

సికింద్రాబాద్​లోని అడ్డగుట్టలో నివాసముండే సందీప్​ కుమార్​ పోచంపల్లి మండలం దేశ్​మూఖ్​లోని సెయింట్​ మేరీస్​ ఇంజినీరింగ్​ కళాశాలలో బీటెక్​ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న తన స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం పిగ్లీపురంలోని చెరువుకు ఈతకు వెళ్లారు. సందీప్​కు ఈత రాకపోవడం వల్ల గల్లంతయ్యాడు. మిత్రులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలించలేదు.

అప్పటికే రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఇవాళఅబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు, ఎన్డీఆర్​ఎఫ్​ బృందం సహాయంతో సందీప్​ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పిగ్లీపురంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

ABOUT THE AUTHOR

...view details