తెలంగాణ

telangana

By

Published : May 26, 2021, 9:53 PM IST

ETV Bharat / state

'కేటీఆర్ చొరవతో నాలాల అభివృద్ధికి నిధులు'

మంత్రి కేటీఆర్​కు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని నాలాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

mla
mla

గత సంవత్సరం పడిన అతి భారీ వర్షాలతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కేటీఆర్ (ఎస్ఎన్డీపీ) కింద నాలాల అభివృద్ధికి రూ.193.49 కోట్ల నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేయడం ఎంతో సంతోషకరమని… మంత్రి కేటీఆర్​కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు నియోజకవర్గంలోని మొత్తం 11 కాల్వలు, నాలల అభివృద్ధికి కేటీఆర్ సహకారంతో నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ అభివృద్ధి పనుల కోసం అతి త్వరలో టెండర్ ప్రక్రియ ద్వారా పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details