వారంతా పొట్ట చేత పట్టుకుని చత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కు వలస వచ్చారు. నగరంలోని మణికొండలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో వారికి ఉపాధి లేక పస్తులుంటున్నారు. గమనించిన ఈటీవీ భారత్ ప్రతినిధి వారిని పలకరించారు.
వారి సమస్యలు విని వెంటనే వారి దీనావస్థనుఆర్థిక శాఖ మంత్రి హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు ఈటీవీ భారత్ ప్రతినిధి. స్పందించిన మంత్రి హరీశ్.. మణికొండ పురపాలిక మెుదటి వార్డు కౌన్సిలర్ వల్లభనేని అనిల్కు విషయం ఫోన్లో చెప్పారు. స్థానికంగా ఉన్న అనిల్ వెంటనే స్పందించి బాధితులకు బియ్యం, పప్పు, డబ్బులు పంపిణీ చేశారు.