తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2020, 7:56 AM IST

ETV Bharat / state

జల్​పల్లి మున్సిపాలిటీలో 5 కంటైన్​మెంట్​ జోన్లు: మున్సిపల్​ కమినర్​

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో ఈ నెల 16 వరకు మొత్తం 17 కరోనా కేసులు నమోదవ్వడం వల్ల 5 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తూ.. నిత్యావసరాలను అందిస్తున్నామని జల్​పల్లి మున్సిపల్​ కమిషనర్​ సఫీ ఉల్లాహ్​ తెలిపారు.

జల్​పల్లి మున్సిపాలిటీలో 5 కంటైన్​మెంట్​ జోన్లు: మున్సిపల్​ కమినర్​
జల్​పల్లి మున్సిపాలిటీలో 5 కంటైన్​మెంట్​ జోన్లు: మున్సిపల్​ కమినర్​

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని పహడి షరీఫ్, కొత్తపేట, వాదిఏ ముస్తఫా, బిస్మిల్లాహ్ కాలనీ, మినార్ కాలనీల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ 5 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి.. ఆ ప్రాంత ప్రజలు బయటకు రాకుండా లాక్​డౌన్​ పటిష్టంగా అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులను ప్రభుత్వ అధికారులు అక్కడే ఉండి అందిస్తున్నారని జల్​పల్లి మున్సిపల్​ కమిషనర్​ అహ్మద్​ సఫీ ఉల్లాహ్​ తెలిపారు.

"జల్​పల్లి మున్సిపాలిటీలో 61 వేల జనాభా, 29 వేల ఇళ్లల్లో ఉన్న 61 వేల జనాభాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాం. రోజూ 28 వార్డుల్లోని అన్ని ప్రాంతాల్లో రసాయనాలతో పిచికారీ చేయిస్తున్నాం. పరిస్థితులను ఎప్పటికప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షిస్తున్నారు."

:-అహ్మద్​ సఫీ ఉల్లాహ్​, జల్​పల్లి మున్సిపల్​ కమిషనర్​​

జల్​పల్లి మున్సిపాలిటీలో 5 కంటైన్​మెంట్​ జోన్లు: మున్సిపల్​ కమినర్​

ఇదీ చూడండి:కరోనా ఔషధం పేరుతో నకిలీ మందులు విక్రయం

ABOUT THE AUTHOR

...view details