ఓ డ్రైవర్ అనారోగ్యంతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తోటి డ్రైవర్లు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్ డ్రైవర్స్ యూనియన్ సభ్యుడు మల్లరి సైదులు అనారోగ్యంతో మే 1న మృతిచెందాడు.
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం - తెలంగాణ తాజా వార్తలు
ఆ గ్రామంలోని ఆటో డ్రైవర్లందరూ ఒకటిగా ఉంటారు. వారిలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా వెంటనే సాయం చేసుకుంటారు. ఈ క్రమంలో ఓ డ్రైావర్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్లు ఏకమయ్యారు. వారిలో వారే ఏం చెద్దామని ఆలోచించుకున్నారు. చివరికి ఓ నిర్ణయం తీసుకున్నారు. మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి చేయూతనిచ్చారు.
![ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం financial help to driver family, anajpur village rangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12199983-50-12199983-1624177070680.jpg)
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం
ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి డ్రైవర్స్ యూనియన్లో ఉన్న... డ్రైవర్లు అందరూ కలసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. మొత్తం 51,200 రూపాయలు వసూలు చేసి వారి కుటుంబానికి అందించారు.
ఇదీ చూడండి:SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్ అవసరమా ?