Demolition of illegal houses: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో అక్రమ ఇళ్లు నిర్మాణాలను పోలీసుల సహాయంతో రెవెన్యూ అధికారులు ఈరోజు ఉదయం నుంచి తొలగిస్తున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 283లో గత కొద్దిరోజులుగా స్థానిక నాయకులు సహకారంతో సుమారు 500 మంది పేదలు గుడిసెలు వేసుకొనగా మరికొందరు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇది గమనించిన రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు సహాయంతో ఈరోజు వాటిని కూల్చే పనిలో పడ్డారు.
అబ్దుల్లాపూర్మెట్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
Demolition of illegal houses: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో అక్రమ ఇళ్లు నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. గ్రామంలో సుమారు 500 అక్రమ గుడిసెలు, తాత్కళిక నిర్మాణాలు గుర్తించిన రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య వాటిని కూల్చేపనిలో పడ్డారు. దీంతో స్థానికులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది.
Demolition of illegal houses
కూల్చివేతలను కొందరు మహిళలు వ్యతిరేకించగా మరికొందరు స్థానిక తహశీల్దార్ను అడ్డుకొని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూల్చివేతలను నిరసిస్తూ కొందరు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇవీ చదవండి: