తెలంగాణ

telangana

By

Published : Sep 25, 2020, 3:43 PM IST

ETV Bharat / state

వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం: వామపక్షాలు

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమని వామపక్షాలు ఆరోపించాయి. వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఐ, సీపీఎం, వాటి అనుబంధ సంఘాలతో కలిసి నిరసన తెలిపాయి.

cpi cpm protest against agriculture bills
వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం: వామపక్షాలు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ బిల్లులు రైతు వ్యతిరేకమని ధ్వజమెత్తాయి. వీటిని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై సీపీఐ, సీపీఎం, వాటి అనుబంధ ప్రజా సంఘాలతో కలిసి నిరసన తెలిపాయి.

వామపక్షాల నాయకులు ఈ బిల్లు ప్రతిని దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రాం చందర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జిల్లా కోర్ కమిటీ సభ్యులు సమేల్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కావాలి నర్సింహ, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:గ్రామాల్లో రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తాంః వీహెచ్

ABOUT THE AUTHOR

...view details