తెలంగాణ

telangana

ETV Bharat / state

షాద్​నగర్​ హత్యకేసు దర్యాప్తునకు 10 బృందాలు

బుధవారం రాత్రి హత్య​కు గురైన పశువైద్యారాలి కేసు దర్యాప్తునకు 10 బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.

By

Published : Nov 28, 2019, 4:17 PM IST

Updated : Nov 29, 2019, 3:27 PM IST

cp-sajjanar-about-shadnagr_murder-case
cp-sajjanar-about-shadnagr_murder-case

షాద్​నగర్​ హత్యకేసు దర్యాప్తునకు 10 బృందాలు

పశువైద్యురాలి హత్యకేసు దర్యాప్తునకు 10 బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. బుధవారం రాత్రి యువతి కిడ్నాప్​కు గురైనట్లు తెలిపారు. కొల్లూరులో వెటర్నరీ వైద్యురాలిగా పనిచేస్తోందని సీపీ పేర్కొన్నారు. ఆమెను ఎవరు తీసుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు దొరికినట్లు వివరించారు. తెలిసినవారు చేశారా? లేదా లారీ వాళ్ల పనా? అనే కోణంలో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆ సమయంలో ప్రయాణించిన అన్ని వాహనాల వివరాలు తీసుకుంటున్నామన్నారు.

Last Updated : Nov 29, 2019, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details