ప్లాస్మాదానం చేసి ఓ వృద్ధురాలి ప్రాణం నిలబెట్టారు కానిస్టేబుల్. హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 75 సంవత్సరాల శ్రీదేవమ్మకు కానిస్టేబుల్ సురేందర్ ప్లాస్మా దానం చేశారు.
వృద్ధురాలికి కానిస్టేబుల్ ప్లాస్మాదానం - ప్లాస్మాదానం చేసిన సరూర్నగర్ కానిస్టేబుల్
కరోనా సోకిన బాధితులకు రాచకొండ పోలీసులు అండగా నిలుస్తున్నారు. వారికి మనోధైర్యాన్నిస్తూ... ఆపత్కాలంలో ప్లాస్మాదానం చేయడానికి ముందుకొస్తున్నారు.
![వృద్ధురాలికి కానిస్టేబుల్ ప్లాస్మాదానం వృద్ధురాలికి ప్లాస్మాదానం చేసిన కానిస్టేబుల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10122418-513-10122418-1609822092564.jpg)
వృద్ధురాలికి ప్లాస్మాదానం చేసిన కానిస్టేబుల్
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్నగర్ పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సురేందర్ ప్లాస్మా దానం చేసి ప్రాణాన్ని కాపాడారు. సురేందర్కు పేషెంట్ తరఫు బంధువులు ధన్యవాదాలు తెలిపారు.
- ఇదీ చూడండి :భయం భయం: హడలెత్తిస్తున్న చిరుతల సంచారం