తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇవాళ చేవెళ్లలో గులాంనబీ ఆజాద్​ ప్రచారం

నేడు రంగారెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ పాల్గొననున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గంలో పర్యటించి... ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు.

By

Published : Apr 7, 2019, 6:38 AM IST

Updated : Apr 7, 2019, 7:00 AM IST

గులాంనబీ ఆజాద్​

ఎన్నికల తేది సమీపించే కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి... ఒక్క క్షణం తీరిక లేకుండా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం ముమ్మరం చేశాయి. నేడు రంగారెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ పాల్గొననున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గంలో పర్యటించి.. కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు.

సాయంత్రం మీర్జాపూర్‌ గేటు వద్ద బహిరంగ సభ

ఇవాళ సాయంత్రం 5 గంటలకు పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడ సమీపంలో మీర్జాపూర్‌ గేటు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నట్లు పరిగి అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్‌ ఇన్​ఛార్జీ రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు.

చేవెళ్లలో గులాంనబీ ఆజాద్​ ప్రచారం

ఇదీ చూడండి :నిజామాబాద్​లో వేగంగా పూర్తవుతున్న పోలింగ్ ఏర్పాట్లు

Last Updated : Apr 7, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details