తెలంగాణ

telangana

By

Published : Jun 22, 2023, 5:01 PM IST

ETV Bharat / state

CM KCR Inaugurates Medha Rail Coach Factory : 'తెలంగాణ బిడ్డలు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేయనున్నారు'

CM KCR Comments at Medha Rail Coach Factory : తెలంగాణ బిడ్డలు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేయనున్నారని.. మేధా పరిశ్రమను చూసి గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మేధా పరిశ్రమ దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో ప్రైవేటు సంస్థ మేధా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు.

CM KCR Speech at Medha Railway Coach Factory
CM KCR Speech at Medha Railway Coach Factory

CM KCR Inaugurates Medha Railway Coach Factory : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన.. ఆసియాలోనే అతి పెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంకొల్లూర్‌లో రెండు పడక గదుల గృహ సముదాయం ప్రారంభోత్సవం అనంతరం.. రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వెలిమల శివారులోని మేధా గ్రూప్‌ నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్​ హాజరయ్యారు.

CM KCR Speech at Medha Railway Coach Factory : సీఎస్​ శాంతికుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని లాంఛనంగా ప్రారంభించారు. రూ.1000 కోట్లతో దేశంలోనే పెద్ద రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీగా నిర్మితమైన ఈ కర్మాగారాన్ని ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ పరిశీలించారు. ఇందులో యంత్రాల పని తీరును అక్కడి సిబ్బంది సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా అనంతరం అక్కడ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

మేధా పరిశ్రమను చూసి గర్వపడుతున్నా :తెలంగాణ బిడ్డలు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేయనున్నారని... మేధా పరిశ్రమను చూసి గర్వపడుతున్నానని సీఎం కేసీఆర్‌అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దీంతో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయని చెప్పారు. 15 రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే అనుమతులు వచ్చినట్టే భావించి పరిశ్రమ ప్రారంభించుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఫార్మా, పౌల్ట్రీ రంగాలు వర్ధిల్లుతున్నాయన్నారు.

'మేధా పరిశ్రమను చూసి గర్వపడుతున్నా. వరంగల్‌ ముద్దుబిడ్డలు కశ్యప్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మేధా ఫ్యామిలీ వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మేధాకు అనుబంధంగా విదేశీ పరిశ్రమలు కూడా వస్తున్నాయి. మేధా ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. మేధా పరిశ్రమ కోసం ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాం. మేధా పరిశ్రమ దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలి.'-ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలి :ముంబయి నుంచి మోనో రైలు ఆర్డర్‌ కూడా మేధా సంస్థకు రావడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ సంస్థకు ప్రభుత్వం తరఫున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీలలో మేధా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఒకటి. సుమారు రూ.800 కోట్లతో కొండకల్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైల్‌ కోచ్‌లు, మెట్రో కోచ్‌లు ఇక్కడ తయారు చేయనున్నారు. కేంద్రం కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా... దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నామని ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details