తెలంగాణ

telangana

'కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకెంతో మేలు జరుగుతుంది'

By

Published : Sep 9, 2020, 6:56 PM IST

రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస కార్యక్తలు టపాసులు పేల్చుతూ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Chevelle trs leaders welcomed and celebrated the new Revenue Act
రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడాన్ని స్వాగతిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోల ప్రభాకర్ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజపూర్ రహదారిపై టపాసులు పేల్చి స్వీట్లు పంచారు.

ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ చట్టంతో రైతులకు మంచి జరుగుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details