ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడాన్ని స్వాగతిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోల ప్రభాకర్ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజపూర్ రహదారిపై టపాసులు పేల్చి స్వీట్లు పంచారు.
'కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకెంతో మేలు జరుగుతుంది' - కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ చేవెళ్లలో సంబురాలు
రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస కార్యక్తలు టపాసులు పేల్చుతూ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
!['కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకెంతో మేలు జరుగుతుంది' Chevelle trs leaders welcomed and celebrated the new Revenue Act](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8740819-192-8740819-1599656608622.jpg)
రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ చట్టంతో రైతులకు మంచి జరుగుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్