తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2021, 7:21 PM IST

ETV Bharat / state

కేసీఆర్ నిర్ణయంతో అగ్రవర్ణ పేదలకెంతో మేలు: ఎమ్మెల్యే

ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్ కల్పించడంతో.. అగ్రవర్ణ పేదల్లో విద్య, ఉద్యోగావకాశాలు మెరుగు పడతాయని ఎమ్మెల్యే కాల యాదయ్య అన్నారు. చేవెళ్లలో తెరాస నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

chevella mla kaala yadaiah says This ews reservation benefits the upper caste poor people
ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్‌తో అగ్రవర్ణాల పేదలకు మేలు: చేవేళ్ల ఎమ్మెల్యే

ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్ అమలు చేయడంతో వారికి ఎంతో మేలు జరుగుతుందని చేవెళ్ల శాసనసభ్యులు కాల యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్-బిజాపూర్ రహదారిపై స్థానిక తెరాస నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ డబ్ల్యూ ఎస్ వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల విద్య, ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కాల యాదయ్య తెలిపారు. అగ్రవర్ణాల వారిలో అనేక మంది పేదలు ఉన్నందువల్లనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస చేవేళ్ళ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సీనియర్ నాయకులు రమణారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'ముత్తూట్ చోరీ' కేసులో ఏడుగురి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details