తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో నడిరోడ్డుపై కారుతో బీభత్సం

​​​​​​​    అతివేగం ప్రాణాంతకం.. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని ఆర్టీఏ అధికారులు ఎంతలా చెబుతున్నా మందుబాబుల చెవికెక్కడం లేదు. ఇబ్రహీంపట్నంలో మద్యం మత్తుతో కారు నడిపిన యువకులు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న విద్యార్థినితో సహా మరో వ్యక్తిని ఢీకొట్టారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

By

Published : Jun 20, 2019, 5:27 PM IST

Updated : Jun 20, 2019, 6:01 PM IST

నడిరోడ్డుపై కారుతో బీభత్సం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్​లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో వాహనం నడిపిన యువకులు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారిని భయబ్రాంతులకు గురిచేశారు. నగరంలోని కూకట్​పల్లికి చెందిన సాయికుమార్, వినీత్​రావ్ ఇబ్రహీంపట్నం మండలం ముక్కునూరు నుంచి ఇబ్రహీంపట్నానికి మద్యం సేవించి కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పింది. వేగంగా నడుపుతూ గ్రామానికి చెందిన మేకల ఆగయ్య, ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని హైమావతిని ఢీకొట్టారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరినీ స్థానికులు ఇబ్రహీంపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నడిరోడ్డుపై కారుతో బీభత్సం
Last Updated : Jun 20, 2019, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details