తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం పంచుతుండగా ఘర్షణ.. భాజపా కార్యకర్తలపై దాడి

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో అధికార పార్టీ నేతలు లిక్కర్ పంచుతుండగా అడ్డుకున్న తమపై దాడులు చేశారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న డీకే అరుణ మైలార్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

By

Published : Nov 29, 2020, 8:02 PM IST

Updated : Nov 30, 2020, 10:47 AM IST

bjp-activists-attack-by-trs-members-obstructed-the-distribution-of-alcohol-at-mailardevpally
మద్యం పంచుతుండగా ఘర్షణ.. అడ్డుకున్న కార్యకర్తలపై దాడి

రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలో అధికార పార్టీ నేతలు లిక్కర్ పంచుతూ పట్టుబడ్డారు. అడ్డుకున్న భాజపా కార్యకర్తలపై దాడులకు దిగారు. పోలీస్​ స్టేషన్​లో భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు.

మద్యం పంచుతుండగా అడ్డుకున్న కార్యకర్తలపై దాడి

ఈ దాడిలో పలువురు భాజపా కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భాజపా నాయకురాలు డీకే అరుణ మైలార్​దేవ్‌పల్లి పీఎస్‌ ఎదుట కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

మద్యం పంచుతుండగా ఘర్షణ.. భాజపా కార్యకర్తలపై దాడి

ఇదీ చూడండి:ఎంఐఎంను ఓడిస్తాం.. ఉద్వేగాలకు లోను కావద్దు: కేటీఆర్​

Last Updated : Nov 30, 2020, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details