తెలంగాణ

telangana

ETV Bharat / state

heavy rain in hyderabad: హైదరాబాద్- బెంగళూరు నేషనల్​ హైవేపైకి వరద.. ట్రాఫిక్ ఆంక్షలు!

భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు(heavy rain in hyderabad) రాజధానిలోని చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గగన్​పహాడ్ వద్ద అప్పచెరువు అలుగు పారుతోంది. ఆ వరద నీరు హైదరాబాద్- బెంగళూరు జాతీయరహదారిపై(flood on hyderabad-Bangalore national highway) ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శంషాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు.

By

Published : Sep 28, 2021, 10:33 AM IST

Updated : Sep 28, 2021, 11:19 AM IST

appa-cheruvu-overflow-on-hyderabad-bangalore-national-highway-due-to-heavy-rains-at-gaganpahad-in-rangareddy-district
appa-cheruvu-overflow-on-hyderabad-bangalore-national-highway-due-to-heavy-rains-at-gaganpahad-in-rangareddy-district

జాతీయ రహదారిపైకి వరద నీరు రావడంతో ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని గగన్​పహాడ్ వద్ద అప్ప చెరువు నిండి అలుగు పొంగిపొర్లుతోంది(heavy rain in hyderabad). హైదరాబాద్- బెంగళూరు జాతీయరహదారిపై అలుగు పారుతోంది. ఈ క్రమంలో శంషాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ఓఆర్‌ఆర్‌ మీదుగా విమానాశ్రయానికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. శంషాబాద్-హైదరాబాద్‌ మార్గంలో రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

అప్రమత్తం చేయాలి...

గతేడాది కురిసిన భారీ వర్షాలకు(heavy rain in hyderabad) అప్ప చెరువు కట్ట తెగి... ఆ నీటిలో కొట్టుకుపోయి ఐదుగురు మృత్యువాత పడ్డారు. కాగా అలుగు నీరు బయటకు పోకుండా వెలిసిన కట్టడాలను తొలగించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువపై నిర్మించిన కట్టడాల వల్లే అలుగు నీరు జాతీయ రహదారి మీదకు వస్తోందని వాపోయారు. అలుగుపారుతున్న అప్ప చెరువును చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వరద ఉద్ధృతి పెరగడం వల్ల ఇవాళ ఉదయం ఆయన సందర్శించారు. చెరువు కట్టపై తిరుగుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని.. అక్కడి నుంచే ఫోన్​లో అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో..

గులాబ్ తుపాను కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr on rains in telangana) ఆదేశాలతో సోమవారం రాత్రి నుంచి సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా... చెరువు కట్టను అనుకోని ఉన్న నిర్మాణాల యజమానులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

జలమయం

గులాబ్‌ తుపాను రాష్ట్రంలోని పలు జిల్లాలను వణికించింది. భారీ వర్షాల(Heavy Rain in Telangana)తో ముంచెత్తింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా వాన(Heavy Rain in Telangana) కురుస్తూనే ఉంది. అధిక వర్షాలతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.

తడిసి ముద్దయిన రాజధాని

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేని వాన(Heavy Rain in Telangana)తో హైదరాబాద్‌ నగరం వణికిపోయింది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కుండపోతగా కురవడంతో వందలాది కాలనీలు నీటమునిగాయి. నాలాలు, కాలువలు ఉప్పొంగాయి. రహదారులు ఏరులయ్యాయి. అనేక ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బహదూర్‌పుర చౌరస్తా నుంచి కిషన్‌బాగ్‌ వెళ్లే రహదారిలో నడుము లోతు నీరు నిలవడంతో స్థానికులు తాళ్ల సాయంతో రోడ్డు దాటారు. మాదాపూర్‌ ప్రాంతంలోనూ రహదారులపై మోకాల్లోతు నీరు చేరింది. గ్రేటర్‌ వ్యాప్తంగా సోమవారం రాత్రి వరకు 42 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్‌ జిల్లా చిట్యాలలో 16.13, సిరిసిల్ల జిల్లా నాంపల్లెలో 15.98, ఖమ్మం జిల్లా బచ్చోడులో 15.15 సెంటీమీటర్లు, కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి-ధర్మారంలో 14.8, జమ్మికుంటలో 14.8, వీణవంకలో 14.3, వైరాలో 14.2, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 11.08 సెం.మీ.ల వర్షం కురిసింది.

ఇదీ చదవండి:Heavy Rain in Telangana : తెలంగాణ అతలాకుతలం.. హైదరాబాద్​ జలమయం... నేడూ భారీ వర్షాలు

Last Updated : Sep 28, 2021, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details