తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓఆర్​ఆర్​ ప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతులు - orr accident updates

బాహ్యవలయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. మృతులంతా కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.

Another two persons died in orr accident incident
ఓఆర్​ఆర్​ ప్రమాదంలో 8కి చేరిన మృతులు

By

Published : Mar 29, 2020, 11:56 AM IST

రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ బాహ్యవలయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. చికిత్స పొందుతూ.. మరో ఇద్దరు ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు వారి స్వగ్రామం రాయిచూర్ తరలించారు.

కర్ణాటక రాయిచూర్​కి చెందిన వలస కూలీలు సూర్యాపేటలో పని చేస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా పనులు లేకపోడం వల్ల సుమారు 30మంది శుక్రవారం రాత్రి బొలెరో ట్రక్​లో బయల్దేరారు. పెద్దగోల్కొండ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టగా.. డ్రైవర్​తో సహా ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో మహిళ చికిత్స పొందుతూ.. ఆస్పత్రితో మృతి చెందింది. తాజాగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ.. రాత్రి ఉస్మానియాలో మరణించారు.

ఓఆర్​ఆర్​ ప్రమాదంలో 8కి చేరిన మృతులు

ఇవీ చూడండి:సీఎం సహాయనిధికి ఆర్టీసీ కార్మికుల ఒకరోజు వేతనం

ABOUT THE AUTHOR

...view details