ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏసీపీ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్లోని వసంత్ పాలీ క్లీనిక్, మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
'ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం' - ఎల్బీనగర్ ఎసీపీ తాజా వార్తలు
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి అన్నారు. వసంత్ పాలీక్లీనిక్, మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

'ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం'
పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఏసీపీ శ్రీధర్ రెడ్డి సూచించారు. బీపీ, ఈసీజీ, షుగర్ టెస్ట్లతోపాటు ఇతర వైద్య పరీక్షలను వైద్యులు ఉచితంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:కోడిపై మర్డర్ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు