తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

By

Published : May 31, 2020, 7:54 PM IST

Updated : May 31, 2020, 10:45 PM IST

3 dead and one injured in road accident at mirjaguda rangareddy district
రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

19:47 May 31

రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.  మృతులు ఆలూరు మండలానికి చెందిన రాఘవేందర్‌, నరేశ్‌, రవిందర్​గా గుర్తించారు. 

అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వీరు నలుగురు 2004-2005లో 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు. అప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా ఉండేవారు. వారిలో రాఘవేందర్ వికారాబాద్ హెడ్ క్వార్టర్స్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో ఆలూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించింది.  

ఇదీ చూడండి :సోమవారం నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 30 ప్రత్యేక రైళ్లు

Last Updated : May 31, 2020, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details