ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల(YS Sharmila) పర్యటన సాగుతోంది. ఉదయం 7గంటలకు లోటస్ పాండ్ నుంచి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. షర్మిల పర్యటనలో అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం సిరిసిల్లకు చేరుకున్న షర్మిలకు.. వైఎస్సార్ అభిమానులు స్వాగతం పలికారు. రాజన్నసిరిసిల్ల, కరీనంగర్ జిల్లాల్లో పర్యటించిన షర్మిల కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్, పదిర గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బాధితులతో ఆమె మాట్లాడారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.
కరోనా కారణంగా ఎంతో మంది ఆప్తులను..ఆస్తులను కోల్పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కార్పోరేట్ వైద్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్రాజశేఖర్రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే కరోనాను రాష్ట్ర ప్రభుత్వం అందులో చేర్చకుండా వందలాది మంది ఉసురు తీసిందని విమర్శించారు. ముఖ్యమంత్రికి కరోనా వస్తే యశోదా ఆస్పత్రికి వెళ్తారు. కానీ పేదలు మాత్రం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ఉంటే బెడ్ ఉండదు..బెడ్ ఉంటే డాక్టర్ అందుబాటులో ఉండరు కాబట్టే ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు.
థర్డ్వేవ్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగించాల్సి ఉండగా వ్యాక్సిన్ల గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌజ్లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో రాజన్నరాజ్యం వస్తుందని అందరిని తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కరీంనగర్లో సింగరేణి కార్మికులను కలుసుకొని వారి నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు.