రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేరు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ అనిల్ తెలిపారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి గాయత్రి పంపు ద్వారా గత పది రోజులుగా నిరంతరాయంగా నీటిని తరలిస్తుండటం వల్ల మధ్య మానేరులో నీరు 15టీఎంసీలకు చేరింది. ఇటీవల శ్రీ రాజరాజేశ్వర జలాశయంగా పేరు మార్చిన మధ్య మానేరు జలాశయం పూర్తి నిల్వ సామర్ద్యం 25టీఎంసీలుగా ఉంది. ఇప్పటికే ఏకధాటిగా నీరు తరలిస్తుండటం వల్ల దిగువ మానేరు జలాశయానికి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని చీఫ్ ఇంజనీర్ అనిల్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
'నీటి విడుదలకు అధికారులు సిద్ధం... ఆయకట్టు రైతుల కోలాహలం' - మధ్య మానేరు జలాశయం
కరీంనగర్, వరంగల్ జిల్లాలకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉన్న దిగువ మానేరు జలాశయంలో నీరు అడుగంటింది. ఈ నేపథ్యంలో మధ్యమానేరు నుంచి నీటిని విడుదల చేయనున్నారనే సమాచారంతో ఈ ప్రాంత రైతుల్లో సంతోషం వెల్లువిరుస్తోంది.
మధ్యమానేరు నుంచి దిగువ మానేరుకు నీటి విడుదలకు నిర్ణయం