తెలంగాణ

telangana

ETV Bharat / state

'విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు' - 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్​ పర్యటించారు.

'విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు'

By

Published : Sep 27, 2019, 10:02 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో జిల్లా కలెక్టర్​ కృష్ణభాస్కర్ పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేదంటూ సర్పంచ్​ నేవూరి వెంకట్ రెడ్డి, కార్యదర్శి వజీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సర్పంచ్, కార్యదర్శలపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి రవీందర్​ను ఆదేశించారు.

'విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు'

ABOUT THE AUTHOR

...view details