తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: 'యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి జరగాలి' - telangana latest news

యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి జరగాలని.. మంత్రులు కేటీఆర్​, ఇంద్రకరణ్​రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు.

ministers ktr and indrakaran reddy review
ministers ktr and indrakaran reddy review

By

Published : Aug 19, 2021, 10:56 PM IST

వేముల‌వాడ శ్రీరాజ‌రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్​లో సమీక్ష నిర్వహించిన మంత్రులు... అభివృద్ధి పనుల పురోగతిపై ఆరాతీశారు.

దేశమే అబ్బుర‌ప‌డేలా ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నట్లు చెప్పిన మంత్రులు... వేములవాడనూ అదే స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. స్థపతులను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు. ఆల‌య అభివృద్ధితో పాటే స‌మాంత‌రంగా ప‌ట్టణాభివృద్ధి జ‌ర‌గాల‌ని... వేముల‌వాడ ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌తో పాటు పుర ప్రజలకు మెరుగైన సౌక‌ర్యాలు అందించ‌డమే ల‌క్ష్యంగా అధికారులు ప‌ని చేయాల‌ని స్పష్టం చేశారు.

పుష్కరిణి, కల్యాణక‌ట్ట, కల్యాణ మండ‌పం, క్యూ కాంప్లెక్స్, క‌ళా భ‌వ‌నం పనులను వేగవంతం చేయాల‌ని... టెంపుల్ టూరిజంలో భాగంగా గుడి చెరువు చుట్టూ నెక్లెస్​ రోడ్ నిర్మించాల‌ని, బోటింగ్​కు త‌గిన‌ ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు తెలిపారు. వేముల‌వాడ‌, మధ్యమానేరులో ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింతగా మెరుగుప‌రిచేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాలని... తద్వారా స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు దొరుకుతాయ‌న్నారు.

బ‌ద్ధిపోచ‌మ్మ ఆల‌య విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని, స్థల సేకరణ వెంటనే చేపట్టాలని తెలిపారు. విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి తగిన పరిహారం చెల్లించాలని ఆదేశించారు. వేముల‌వాడ‌లో ద‌శల వారిగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి ప‌నుల‌ు చేప‌ట్టాల‌ని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వేముల‌వాడ‌కు వచ్చే సామాన్య భ‌క్తులకు బ‌స్టాండ్ నుంచి ఆల‌యం వ‌ర‌కు ఉచిత ప్రయాణం కల్పించాలని... ఇందుకోసం మినీ ఎల‌క్ట్రిక‌ల్ బస్సుల‌ను అందుబాటులోకి తెచ్చేలా చ‌ర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

వేముల‌వాడ ప‌ట్టణ సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలన్న మంత్రులు... వ‌చ్చిన ప్రతిపాదనలను సానుకూలంగా ప‌రిశీలించాల‌ని ఆదేశించారు.

ఇదీచూడండి:Minister KTR: త్వరలో ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్ట్.. ముందుగా ఆ రెండు జిల్లాల్లోనే!

ABOUT THE AUTHOR

...view details