తెలంగాణ

telangana

ETV Bharat / state

దొరికేశారు: రాజన్న ఆలయంలో 'కోడె' టికెట్ల రీసేల్​! - రాజరాజేశ్వర ఆలయం తాజా వార్తలు వేములవాడ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కుల టికెట్లు తిరిగి కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు భక్తులకు ఆలయ రికార్డ్​ అసిస్టెంట్​ విజయ్​ నాలుగు టికెట్లను విక్రయించాడు. అయితే ఉచిత లడ్డూ తీసుకునే క్రమంలో టికెట్లు చెల్లవని సిబ్బంది చెప్పడం వల్ల ఎస్పీఎఫ్, ఆలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.

రాజన్న ఆలయంలో కోడె టికెట్ల రీసేల్​..
రాజన్న ఆలయంలో కోడె టికెట్ల రీసేల్​..

By

Published : Nov 18, 2020, 7:23 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బుధవారం కోడె మొక్కుల టికెట్లు తిరిగి కొనుగోలు చేస్తూ ఓ ఉద్యోగి పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లాకు చెందిన సీహెచ్. సత్తయ్య, సిద్దిపేట జిల్లాకు చెందిన యాదవరెడ్డిలు కోడెమొక్కుల క్యూలైన్లో టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న విజయ్ 4 టికెట్లను విక్రయించాడు. ఉచిత లడ్డూ తీసుకునే క్రమంలో టికెట్లు చెల్లవని సిబ్బంది చెప్పడం వల్ల ఎస్పీఎఫ్, ఆలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేసిన అధికారులు అవి దొంగ టికెట్లుగా తేల్చారు. రికార్డ్​ అసిస్టెంట్​ విజయ్ నుంచి రూ. 5007 నగదు, కోడె టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. రికార్డ్ అసిస్టెంట్ విజయ్​పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఏఈవో హరి కిషన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:నిధుల కేటాయింపులో జాప్యం... నెమ్మదించిన రాజన్న ఆలయ అభివృద్ధి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details