తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న భక్తులకు కరోనా స్కానింగ్​ - రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కరోనా పరీక్షలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్నారు. ఆలయానికొచ్చే భక్తులకు హై టెంపరేచర్ యంత్రంతో స్కానింగ్ చేసిన తర్వాతనే ఆలయంలోకి అనుమతిస్తున్నారు.

CORONA SCANNING
రాజన్న భక్తులకు కరోనా స్కానింగ్​

By

Published : Mar 18, 2020, 10:46 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు ఆలయాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో థర్మల్​ స్కానింగ్​ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఎప్పటికప్పుడు రసాయనాలతో శుద్ధి చేస్తున్నారు.

స్వామివారి దర్శనానికొచ్చే భక్తులను థర్మల్​ స్కానింగ్​ ద్వారా తనిఖీ చేసిన తర్వాతనే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో వైరస్ పట్ల అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన లౌడు స్పీకర్ల ద్వారా కూడా​ భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆలయ సిబ్బంది వివరిస్తున్నారు.

రాజన్న భక్తులకు కరోనా స్కానింగ్​

ఇదీ చూడండి:త్వరలో ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details