రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం చేశారు. భారత్-చైనా సరిహద్దులో చైనా సైనికుల దురాగతానికి బలైన భారత సైనికులకు నివాళులు అర్పించారు. చైనాకు తగిన మూల్యం చెల్లించేందుకు దేశవ్యాప్తంగా చైనా వస్తువులు బహిష్కరించాలని, ప్రజలెవరూ చైనా వస్తువులు కొనొద్దంటూ పిలుపునిచ్చారు.
సిరిసిల్లలో చైనా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన భజరంగ్దళ్ నాయకులు - చైనా వస్తువుల బహిష్కరణ
భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన 20 మంది భారత సైనికులకు సిరిసిల్ల భజరంగ్ దళ్, వీహెచ్పీ నాయకులు నివాళులు అర్పించారు. భారతదేశంలో చైనా వస్తువులు బహిష్కరించాలని, ప్రజలంతా చైనా వస్తువులు కొనొద్దని పిలుపునిచ్చారు.
![సిరిసిల్లలో చైనా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన భజరంగ్దళ్ నాయకులు Siricilla VHP, Banjarang Dal Leaders Call For Ban China Produts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7697052-457-7697052-1592650088940.jpg)
సిరిసిల్లలో చైనా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన భజరంగ్దళ్ నాయకులు
తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. చైనాకు తగిన బుద్ధి చెప్పేలా, భారత్ సత్తాను ప్రపంచానికి తెలిసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల