కేటాయింపులు ఇలా..
రాజన్న ఆలయ బడ్జెట్ రూ. 131.71 కోట్లు - వేముల వాడ ఆలయ వార్షిక బడ్జెట్
వేములవాడ రాజన్న ఆలయంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను అధికారులు రూపొందించారు. ఆలయ అభివృద్ధి, పారిశుద్ధ్యం, భక్తుల సౌకర్యాల కల్పనకు అధిక మొత్తంలో నిధులు కేటాయించారు.
రాజన్న ఆలయ బడ్జెట్
మహాశివరాత్రి రోజు జరిగే శివ కల్యాణం, ఇతర సంప్రదాయ వేడుకల కోసం రూ.1.83 కోట్లు, ప్రసాదాల తయారీకి రూ. 12 కోట్లు కేటాయించారు. పారిశుద్ధ్యం నిర్వహణకు రూ. 4.32 కోట్లు, ఆలయం భద్రతకు రూ. 2 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు.
రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాల కల్పనకు ఈసారి బడ్జెట్లో పెద్దపీట వేశామని ఈవో తెలిపారు.
ఇదీ చదవండి :కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!